పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఒక వేళ ఏదైనా సందర్భంలో భర్త చనిపోతే, ఆ మహిళ పడే బాధ గురించి, ఎంత చెప్పినా తక్కువే. అయితే నేపాల్లోని ఖాట్మండులో నేవారీ తెగ వారు ఆడపిల్లకు మూడుసార్లు వివాహం చేస్తారంట. 5-10 వయసు మధ్యలో మారేడు పండుతో మొదటి వివాహం చేస్తారంట. రెండో వివాహం 10-15 ఏళ్ల మధ్యలో సూర్యుడితో జరిపిస్తారంట. ఇక మూడో వివాహం తమకు ఇష్టమైన వ్యక్తితో చేస్తారంట. భర్త చనిపోయినా ఆ మహిళను సుమంగళిగా భావిస్తారు.