భార్య వేధిస్తుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

53చూసినవారు
భార్య వేధిస్తుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
తమిళనాడులోని కోవై రామనాథపురం ప్రాంతానికి చెందిన సెంథిల్‌ కుమార్, అశోకా దేవి 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం దేవికి ఇదివరకే వివాహమైందని, మెదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని, ఆ విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకుందని సెంథిల్‌ కుమార్‌కు తెలిసింది. దీంతో భార్యను నిలదీయగా ఆమె తనను చిత్రహింసలు పెడుతోందని వాపోతూ శుక్రవారం సెంథిల్‌ కుమార్‌ కోవై నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్