పూరీ రత్నభాండాగారం నుంచి విలువైన వస్తువుల తరలింపు పూర్తి అయ్యింది. ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు వాటిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియకు ఏడు గంటల సమయం పట్టినట్లు తెలిపారు. కాగా, దాదాపు 40 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచిన విషయం తెలిసిందే.