డాక్టర్లు అందుబాటులో లేరని డెలివరీ చేసిన నర్సులు.. శిశువు మృతి

64చూసినవారు
డాక్టర్లు అందుబాటులో లేరని డెలివరీ చేసిన నర్సులు.. శిశువు మృతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, నర్సులు ప్రసవం చేయడంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వివరాల ప్రకారం.. నాగసాలకు చెందిన కీర్తి ప్రసవం కోసం రాగా, అంతా బాగానే ఉందని రేపటిలోపు డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ సాయంత్రం పురిటినొప్పులు రాగా, హెడ్ నర్స్ ఆమెకు ప్రసవం చేశారు. అయితే ఉమ్మనీరు తాగడంతోనే శిశువు చనిపోయిందని వైద్యులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్