స్థానికంగా విద్యుత్తు సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో రైతులే లైన్మెన్ల అవతారమెత్తుతున్నారు. కరెంట్ స్తంభాలు ఎక్కి, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. సంబంధిత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.