ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను ఎంక్వయిరీ చేసిన అధికారులు, వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇప్పటివరకు అరెస్టై జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ అధికారులు వేర్వేరుగా ఇచ్చిన స్టేట్మెంట్లలో ‘చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే...’ అంటూ వారు వెల్లడించారు. దీంతో ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు టీం భావిస్తుంది.