ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్రావు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోలీస్ వాహనాల్లో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన డబ్బులను తరలించేవారు. రాధాకిషన్ డబ్బు తరలించేందుకు ఓ ఎస్సైకు కొత్త ఐఫోన్ను, సీమ్ కార్డును అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్రావు ఆ ఫోన్కే కాల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.