భర్త నుంచి సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న భార్య

57చూసినవారు
కేరళ చరిత్రలోనే తొలిసారి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వేణు గత నెల 31న రిటైర్ కావడంతో ఆయన భార్య శారదా మురళీధరన్ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. తిరువనంతపురంలోని సెక్రటేరియట్‌లో భర్త నుంచి భార్య బాధ్యతలు తీసుకున్న వీడియో ఆకట్టుకుంటోంది. కాగా ఇద్దరూ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లే. అయితే సీనియారిటీ ప్రకారం వేణు తర్వాత శారద ఉండటంతో ఆమె సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్