అత్తని 95 సార్లు పొడిచి చంపిన మహిళ

62చూసినవారు
అత్తని 95 సార్లు పొడిచి చంపిన మహిళ
అత్తగారిని దారుణంగా 95 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన 24 ఏళ్ల యువతికి మధ్యప్రదేశ్ రేవా జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. జిల్లాలోని అత్రైలా గ్రామానికి చెందిన కంచన్ కోల్, ఆమె 50 ఏళ్ల అత్త సరోజ్ కోల్‌ను హత్య చేసింది. ఈ కేసును విచారించిన రేవా అదనపు సెషన్స్ జడ్జి పద్మా జాతవ్ కంచన్‌ని దోషిగా నిర్ధారించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వికాస్ ద్వివేది తెలిపారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం (2022 జులై 12న) అట్రైలా గ్రామంలో జరిగింది.