సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం చేసిన యువకులు!

85చూసినవారు
సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం చేసిన యువకులు!
జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి అత్యాచారం చేసిన ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. రాజ్‌గంజ్ ప్రాంతంలోని శ్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని.. స్థానిక ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాజ్‌గంజ్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోని విచారణ ప్రారంభించారు.