రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలనే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ అన్నారు. తాండూరులో ఆమె మాట్లాడుతూ.. 'తెలంగాణతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. సోనియమ్మపై అంతే అభిమానం చూపించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారు. ఉత్తరప్రదేశ్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉంటే, తెలంగాణలో రూ.500కే ఇస్తున్నాం' అని అన్నారు.