ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న ప్రధానులు వీరే.!

54చూసినవారు
ఇప్పటి వరకు భారతరత్న అందుకున్న ప్రధానులు వీరే.!
భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవి నరసింహరావు, చరణ్ సింగ్ లకు ప్రకటించింది. ఇప్పటివరకు మన దేశానికి 14 మంది పూర్తి స్థాయి ప్రధానులుగా సేవలు అందించారు. వీరిలో 8 మంది భారతరత్న పురస్కారానికి ఎంపిక అయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం), ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ (మరణానంతరం), మొరార్జీ దేశాయ్, వాజ్ పేయీలకు గతంలోనే ఈ అవార్డు దక్కింది. తాజాగా పీవీ, చరణ్ సింగ్ వారి సరసన నిలిచారు. ప్రస్తుత ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్, హెబ్రీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ లకు భారతరత్న ఇంకా దక్కలేదు.

సంబంధిత పోస్ట్