టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.