1630 ఫిబ్రవరి 19న పుణె జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు శివాజీ జన్మించారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ’ఛత్రపతి ’ అని బిరుదును ప్రదానం చేశారు. 27ఏళ్ల పాటు యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నిరంతరంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మరణించారు.