హైదరాబాద్లో పట్టపగలు యూపీ, బీహార్ తరహాలో ఓ బంగారం షాప్లో దోపిడీకి పాల్పడ్డారు. మలక్పేట అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జ్యూవెల్లరీ షాప్లో ఈ చోరీ జరిగింది. టోపి, మాస్క్ ధరించి ఒకరు కస్టమర్ లాగా వచ్చాడు. మరో ఇద్దరు వచ్చి కౌంటర్లో ఉన్న వ్యక్తిని కత్తితో బెదిరించి కొట్టారు. అనంతరం షాప్లో ఉన్న గోల్డ్ను బ్యాగులో నింపుకొని పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.