ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్ జిల్లా కేద్రుపూర్ గ్రామంలో మనోజ్ పాఠక్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మనోజ్ మృతి తట్టుకోలేక ఆయన భార్య కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ దంపతులకు ఐదేళ్లలోపు వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల మరణంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తల అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఒకేసారి నిర్వహించారు.