తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, నిర్మాతలు

74చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన త్రివిక్రమ్, నిర్మాతలు
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలను సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపారు. విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్