బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక (వీడియో)

63చూసినవారు
రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. బండికుయ్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ ప్రమావదశాత్తు బోరు బావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, ఎస్పీ రంజితా శర్మ, స్థానిక యంత్రాంగం అందరూ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావి లోతు దాదాపు 20 అడుగుల ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్