వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది!

51చూసినవారు
వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది!
వందేభారత్ సీటర్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభించడంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి రైలు పరుగులు పెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని సమాచారం. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద.మ రైల్వే జీఎంకి సూచించారు. ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది.

సంబంధిత పోస్ట్