VIDEO: మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరి అరెస్ట్‌

68చూసినవారు
ఏపీలోని గుంటూరు జిల్లాలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. దుగ్గిరాల మండలం చింతలపూడిలో తనపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని ఆర్టీసీ డ్రైవర్ గోపీ ఆరోపించారు. రేపల్లె నుంచి విజయవాడకు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దాడిలో తన చెయ్యి విరిగిందని డ్రైవర్ గోపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లెపాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్