ఢిల్లీకి బయలుదేరిన ఒగ్గు కళాకారులు

58చూసినవారు
ఢిల్లీకి బయలుదేరిన ఒగ్గు కళాకారులు
కొడంగల్ నియోజకవర్గం బొంరస్ పేట మండలం నందార్ పూర్ గ్రామానికి చెందిన ఒగ్గుడోలు వ్యవస్థాపక అధ్యక్షుడు ఓగ్గు బీరప్ప ఆధ్వర్యంలో 5 మంది ఒగ్గుడోలు కళాకారులు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బోనాల పండుగ వేడుకలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9, 10 తేదీల్లో జరిగే ఒగ్గు ప్రదర్శనకు రాష్ట్రం తరఫున అవకాశం లభించిందని ఒగ్గు బీరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మల్లేష్, శివకుమార్, రాఘవేందర్, తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you