కాంగ్రెస్ నాయకుల అసత్య ఆరోపణలు-మహిపాల్

82చూసినవారు
కాంగ్రెస్ నాయకుల అసత్య ఆరోపణలు-మహిపాల్
కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం పై అసత్య అబద్దాల ప్రచారం మానుకోవాలని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మహిపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ. తెలంగాణలో గ్రామాల అభివృద్ధి, ఉపాధి నైపుణ్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మొబైల్, బంగారంపై సుంకాన్ని తగ్గించడం జరిగిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం సమంజసం కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్