అక్రమ కేసులు పెట్టాడని ఎస్సై పై కేసు నమోదు

58చూసినవారు
అక్రమ కేసులు పెట్టాడని ఎస్సై పై కేసు నమోదు
వికారాబాద్ జిల్లాకి చెందిన శంకర్ అనే వ్యక్తి పై ఎస్సై దయా సాగర్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఉన్నత అధికారులకు బాదితుడు పిర్యాదు చేసాడు. అధికారులు ఎస్సై పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని బాదితుడు హైకోర్టుకి వెళ్లి రిట్ పిటిషన్ పెట్టగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎస్సై పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించింది. ఎస్సై పై ఐపీసీ 323,324, 504 సెక్షన్ కింద కేసు నమోదైంది.