జయశంకర్ జిల్లా మల్హర్ మండలం రుద్రారంకి చెందిన బట్టి శ్యామల- రాజకుమార్ దంపతుల 8నెల బాబుకు లివర్ ఇన్ఫెక్షన్ సోకగా లివర్ మార్పిడికి సుమారు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. పసి బాబుకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి ముందుకు వచ్చి మంగళవారం రూ. 10, 000 ఆర్థికసహాయం అందజేసి భరోసాకల్పించారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి బాబుకు ప్రాణభిక్ష పెట్టాలని కోరారు.