సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ ప్రాంగణాన్ని సోమవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు. బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరు పాల్గొననున్నారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ తో పాటు హేలిప్యాడ్ దిగే స్థలాన్ని ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ మలేష్, ఎస్సై రవికుమార్ ఉన్నారు.