వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు

14489చూసినవారు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో 353 (సీ) జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంజయ్, సంపత్ మరో యువకుడితో కలిసి బైక్ పై మండల కేంద్రానికి వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూరారం గ్రామానికి చెందిన రాజబాపుతో పాటు మరో యువకుడు బైక్ పై కాటారంకు వస్తుండగా రెండు బైక్ లు ఢీకొనడంతో రోడ్డు పై పడి గాయపడ్డారు.

ట్యాగ్స్ :