గత ఏప్రిల్ 23 నుండి పాఠశాలలకు ఇచ్చిన సెలవుల గడువు ముగియడంతో జూన్ 12 వ తేదీ నుంచి యధావిధిగా ప్రారంభించనున్నట్లు జనగాం జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ జనగాం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలని, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ లు ప్రభుత్వపాఠశాలల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు.