గుండెపోటుతో యువరైతు మృతి

73చూసినవారు
గుండెపోటుతో యువరైతు మృతి
బయ్యారం మండలంలోని వెంకట్రాపురం గ్రామానికి చెందిన యువరైతు గుగులోత్ సైదులు (36) గుండెపోటుతో మృతి చెందాడు. గత వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న సైదులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడని స్థానికులు తెలిపారు. మృతుడికి మే నెలలో వివాహం అయిందని, భార్య ఆశాడమాసం కావడంతో తల్లిగారింటికి వెళ్లినట్లు తెలిపారు. ఇంతలోనే దుర్ఘటన చోటు చేసుకోవడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్