వరదలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: ఎస్సె

50చూసినవారు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని గోదావరి ముంపు గ్రామాలైన టేకులబోరు, వెంగళరావుపేట, తురసవాణిగూడెం గ్రామాలను మంగళవారం ఎస్సై అశోక్ సందర్శించి మాట్లాడారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ గత సంవత్సరం గోదావరి వరద సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మరి కొన్ని రోజుల్లో గోదావరి వరదలు రానున్నాయని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్