ములుగు జిల్లా కేంద్రంలో రేపు రక్తదాన శిబిరం

79చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో రేపు రక్తదాన శిబిరం
ములుగు జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఎంపిడిఓ మీటింగ్ హాల్ లో కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు గురువారం అధికారులు తెలిపారు. రక్తదాన శిబిరంలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్