అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాజేడు ఎస్సై వెంకటేశ్వర రావు అన్నారు. ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ఇప్పగూడెం గ్రామంలో సీఆర్పిఎఫ్ సిబ్బంది, సివిల్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని సూచించారు.