మంగపేట మండలంలో ఉప్పొంగిన కప్పవాగు.. రాకపోకలు బంద్

77చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలంలో సోమవారం నుండి కురుస్తున్న భారీ వర్షానికి దోమెడ - తక్కళ్లగూడెం గ్రామాల మధ్య కప్పవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని, ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్