ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షం

51చూసినవారు
ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కుండపోత వర్షం మొదలైంది. ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షాధార పంటలపై ఆధారపడ్డ రైతులకు ఈ వర్షం కురువడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల వరి రైతులు నార్లు పోశారు. కాగా పత్తి విత్తనాలు వేసిన రైతులకు ఇప్పుడే వస్తున్న మొలకలకు ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగ పడనున్నాయని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్