కన్నాయిగూడెం మండలాన్ని అభివృద్ధి చేయాలి: అదనపు కలెక్టర్

57చూసినవారు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. కన్నాయిగూడెం మండలం అస్పిరేషనల్ బ్లాక్ మండలంగా ఎంపికైందని, ఇందులో భాగంగా సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని జులై 4 నుండి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్