మేడారం సారలమ్మ పూజారి మృతి

82చూసినవారు
మేడారం సారలమ్మ పూజారి మృతి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం కన్నెపెల్లి విషాదం నెలకొంది. సారలమ్మ పూజారి కాక సంపత్ మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం. తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన కాక సంపత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. పూజారి మరణంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్