ఏటూరునాగారం-ములుగు రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

80చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం - చిన్న బోయినపల్లి మధ్య జాతీయ రహదారిపై భారీ వృక్షం విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనతో సుమారు 2 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ములుగు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై తాజుద్దీన్ గురువారం జేసిబి సహాయంతో భారీ వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్