జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని వ్యాపారస్తులు నాసిరకం వంట నూనెలు అమ్ముతూ లాభాలు ఆర్జిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని శాతపురం గ్రామానికి చెందిన పసులాది ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ దుకాణ యజమానులు బ్రాండెడ్ ఆయిల్ ని పోలిన మరో రకం ఆయిల్ ప్యాకెట్ ఇచ్చాడని ప్యాకెట్ విప్పి చూడగా విపరీతమైన దుర్వాసన కలిగి చాలా ఎరుపు రంగులో ఉందని దీనిపై పిర్యాదు చేశానన్నారు.