ఆశాల పల్లి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

979చూసినవారు
ఆశాల పల్లి లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సంగెం మండలం లోని అశాలపల్లి గ్రామము లోని కుచన గార్డెన్స్ లో సోమవారం ఉదయం 10 గంటలకు గీతాంజలి ఆశ్రమ పాఠశాల లో 1997 - 98 సంవత్సరం లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఒక చోట కలిసి తమ గురువులను సన్మానించి తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందించారు. ఈ కార్యక్రమం లో అప్పటి వారి గురువులు వెంకటేశ్వర్లు, వాణి, రాములు, వేణుగోపాల్ తో పాటు కాట్రపల్లీ, ఆశాలపల్లీ, తీగరజుపల్లి, గవిచర్ల గ్రామాల విద్యార్థులు శ్రీనివాస్, జయెందర్, త్యాగరాజు, సృజన, కల్పన తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్