నడికుడ మండలం చర్లపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. తన మోటార్ సైకిల్ పై మైక్ ను కట్టుకొని చర్లపల్లి గ్రామంలో వీధి , వీధి తిరుగుతూ, ఇంటింటికి పోయి విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగింది.