హైనా దాడిలో గేదె మృతి

63చూసినవారు
హైనా దాడిలో గేదె మృతి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో హైనా పశువులపై దాడి చేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ముసిపట్ల బిక్షపతి అనే రైతుకు చెందిన పశువులపై హైనా మంగళవారం రాత్రి దాడి చేసింది. ఘటనలో ఓ గేదె మృతి చెందింది. గతంలో సైతం హైన దాడిలో తమ పశువులు మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు ఆవేదన చెందారు. అటవీ శాఖ అధికారులు వాటిని కట్టడి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్