
కరుణాపురం క్రీస్తుజ్యోతి మందిరంలో క్రిస్మస్ వేడుకలు
ధర్మసాగర్ మండలం, కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో బుధవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సతీమణి వినయరాణి పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరుపొందిన కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కిందన్నారు.