విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం: CM చంద్రబాబు

51చూసినవారు
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం: CM చంద్రబాబు
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 'చరిత్రను తిరగరాసేందుకు ఇక్కడ సమావేశమయ్యాం. ఉమ్మడి ఏపీలో సైబరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మాదే. ముందుచూపుతో ఆనాడే సైబరాబాద్‌లో 8 వరుసల రోడ్లు వేశాం. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్