రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది?: మంత్రి పొన్నం

61చూసినవారు
రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది?: మంత్రి పొన్నం
తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. 'రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసింది. ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చిందా? బీజేపీని వ్యతిరేకిస్తే.. ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా మా ప్రభుత్వం సాగుతోంది' అని అన్నారు.