కైలాస దేవాలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయం. ఇందులోని ఒక రాయి పల్లవుల కాలాన్ని తెలుపుతుంది. అంటే బహుశా దీని నిర్మాణం క్రీ.శ. 8వ శతాబ్దంలో చేపట్టి ఉండవచ్చని అంచనా. దీనిని కైలాసం అని కూడా అంటారు.