భారతీయ ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కాంగోలో యూఎన్ పీస్కీపింగ్ మెషీన్లో పనిచేసిన ఆమెకు ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. యూఎన్ పీస్కీపర్గా మహిళలు, అమ్మాయిల హక్కుల కోసం ఆమె అసాధారణ పోరాటం చేశారు. యుద్ధ ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళల్ని రక్షిస్తున్న నేపథ్యంలో ఆర్మీ ఆఫీసర్కు అవార్డు అందజేయనున్నారు.