ప్రపంచంలో బ్రహ్మదేవుడి ఆలయాల సంఖ్య చాలా తక్కువ. రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మకు ఆలయం ఉంది. ఆ తర్వాత తెలంగాణలో అలంపూర్లోని జోగులాంబ దేవాలయంలో కూడా బ్రహ్మకు ఆలయం ఉంది. ఇక్కడ బ్రహ్మ 9 రూపాల్లో దర్శనమిస్తారు. బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్థబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 6వ శతాబ్ధంలో చాళుక్యరాజులు నిర్మించారు.