ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఛోటూ, అంజలి ఇద్దరు భార్యాభర్తలు. ఛోటూ దొంగతానలకు పాల్పడేవాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య జూన్ 9న గొడవ జరిగింది. కొంత సమయం తర్వాత భార్య అంజలి సమోసా తీసుకురావాలని భర్త ఛోటూను కోరింది. భర్త సమోసాతో ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఆమె మృతిని తట్టుకోలేక ఛోటూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఛోటూ చనిపోతున్నట్లు మామకు ఫోన్లో చెప్పి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.