ఐపీఎల్-2024 ఆరెంజ్ క్యాప్ విన్నర్గా ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచారు. ఈ సందర్భంగా కోహ్లీ స్పందించారు. 'ఈ సీజన్లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. జట్టు మాత్రం ఒడుదొడుకులు ఎదుర్కొంది. రెండో హాఫ్లో వరుసగా మ్యాచ్లు గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ఈసారి బలంగా తిరిగివస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా కోహ్లీ అందుబాటులో లేనందున ఆయన తరఫున ఆరెంజ్ క్యాప్ అవార్డును శ్రేయస్ అయ్యర్ అందుకున్నారు.