ఏపీలో ఎన్డీయే కూటమి విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని, ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.