జగన్ ఓదార్పు యాత్ర 2.0 చేస్తారేమో: RRR
By Somaraju 15930చూసినవారుజగన్ ఓదార్పు యాత్ర 2.0 చేస్తారేమో అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎవరిని ఏమి అనకముందే మమ్మల్ని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయి చెప్పడం సిగ్గు చేటని, దొంగే దొంగ అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ గెలుస్తుందని పందాలు కాసి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటే అధికారంలోకి రానందువల్లే ఆత్మహత్య చేసుకున్నారని అనడం తగదన్నారు. ఇకపై జగన్ గురించి వ్యక్తిగతంగా తానేమీ మాట్లాడనన్నారు.